Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుబాటులోకి అత్యాధునిక చికిత్స
- అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ క్యాన్సర్పై' అవగాహనా సదస్సు
- హాజరైన 2200 మంది నిపుణులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
క్యాన్సర్ చికిత్సకు సంబంధించి తాజా పురోగతిపై అంతర్జాతీయ క్యాన్సర్-2018 సమావేశాలను అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (ఏఓఐ) నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సలో వచ్చిన నూతన విధానాలను చర్చించి ఆద్యాయనం చేసిన అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టుట్యూట్ హైదరాబాద్ అంతర్జాతీయ క్యాన్సర్ సదసును శుక్రవారం బంజారాహిల్స్లోని హోటల్ పార్క్హయత్లో నిర్వహించింది. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎమ్.బాబయ్య అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన దాదాపు 2200 మంది వైద్యనిపుణుల తోపాటు 150 మంది అధ్యాపకులు హాజరయ్యారు. క్యాన్సర్ చికిత్సకు అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలేజీతో పాటు, దాని పనితీరుపై నిపుణులు ఈ సదస్సులో చర్చించారు. పలుసూచనలు సలహాలు అందించారు. ఈ సమావేశానికి హాజరైన యూపీఎంసీ క్యాన్సర్ కేంద్రం చైర్మన్, క్లినికల్ సిర్వీసెస్ డైరక్టర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్టాన్లీ మార్క్స్ మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారతదేశంలో క్యాన్సర్ మరణాల రేటు రెండు రేట్లు అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్ నివారణకు అత్యాధునిక శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని, భయపడాల్సిన అంవసరం లేదన్నారు. ముందుగా గుర్తించి చికిత్స చేయిస్తే సులువుగా జయించవచ్చన్నారు. క్యాన్సర్ చికిత్సకు నిర్ధిష్టమైన ప్రణాళిక అవసరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 8 మిలియన్ రోగులు మరిణిస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం కొత్తగా 14వేల మిలియన్ కేసులు నమోదవుతున్నాయని వివరించారు. 2015లో ఇండియాలో సుమారుగా మిలియన్ కొత్తగా క్యాన్సర్ కేసులు నమోదు కాగా, తాజాగా ఆ సంఖ్య 3.9 మిలియన్లకు చేరిందన్నారు. భారత దేశంలో ప్రతి సంవత్సరం 7లక్షల మంది ప్రజలు క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. 2020 నాటికి 17లక్షల క్యేన్సర్ కేసులు నమోదయ్యే అవకాశముందన్నారు. ప్రతి ఒక్కరు క్యాన్సర్ నివారణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అరిజోనా అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. అజరు భట్నాగర్ మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సకు నిర్ధిష్టమైన ప్రణాళిక ఉంటుందని, ఇందులో చాలా వరకూ ఒకటి కంటే ఎక్కువ పద్దతులున్నాయన్నారు. రేడియేషన్, మెడికల్ లేదా సర్జికల్ ఆంకాలజీ వంటి పద్దతులను పాటించాలని సభ్యులకు వివరించారు. అనంతరం అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ సీఈఓ డాక్టర్ జాగ్ ప్రాగ్ సింగ్ గుజ్రాల్ మాట్లాడుతూ దక్షిణాసియాలో వీలైనంత మేరకు ఎక్కవ మందికి మేలు చేసేలా సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో నాగపూర్, కొలంబోలలో సైతం అవగాహన సదస్సులను నిర్వహిస్తామని తెలిపారు.