Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చాధర్ఘాట్
టీఆర్ఎస్ను ఓడిస్తేనే ప్రజలకు మేలు జరుగు తుందని సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ అజీజ్ పాషా అన్నారు. చాధర్ఘాట్లోని ఇంపీరియల్ గార్డెన్లో మలక్పేట మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముజాఫర్ అలీఖాన్ అధ్వర్యంలో శుక్రవారం టీజేఎస్, కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ నాయకుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కొత్త హామీలతో మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మహాకూటమి అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ముజాఫర్ అలీఖాన్ మాట్లాడుతూ సంఫ్ు పరివార్, మత విద్రోహ శక్తులను ఓడించాలన్నారు. మహాకూటమి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఈటీ నర్సింహ్మ, బీసీ సంఘం నాయకులు శ్యాంసుందర్, కాంగ్రెస్ నాయకులు విజయసింహరెడ్డి, రవీందర్రెడ్డి, పలకం శ్రీనివాస్, టీడీపీ నాయకులు శ్రీనివాసాచారి, నర్సింగ్, టీజేఎస్ నాయకులు రామన్సింగ్, తదితరులు పాల్గొన్నారు.