Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధూల్పేట్ : నయాపూల్ ఐసీఐసీఐ బ్యాంక్ ఎదుట ధారుణంగా వ్యక్తిని గొంతుకోసి హత్య ఉదంతాన్ని మీర్ చౌక్ పోలీసులు ఛేదించారు. హత్య కేసుతో సంబందించిన మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 27వ తేదిన నిందితుడు షేక్ఖాజా హుస్సేన్, బాధితుడు మహ్మద్ షాకేర్ మధ్య జరిగిన వివాదంలో హుస్సేన్ను, షాకేర్ను కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యతో సంబందం ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు షాహెబ్నగర్ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ ఇమితియాజ్(30), సరూర్నగర్ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ ఆయూబ్(23), మలక్పేట్ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ అలీమ్(30)లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.