Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న సామాజిక మాధ్యమాల ఆధారిత మోసాలు
- నేరాలను కట్టడి చేసేందుకు సీసీఎస్ పోలీసుల ప్రచారం
నవతెలంగాణ - సిటీబ్యూరో
టెక్నాలేజీ అభివృద్ధి చెందినా కొద్దీ.. అదే ఆసరాగా సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. నిరుద్యోగులే లక్ష్యంగా కొందరు దోచుకుంటుంటే, మరికొందరు పెండ్లీ సంబంధాల పేరుతో బుట్టలోకి లాగుతున్నారు... ఇంకొందరు వాట్సాప్, ఈ మేయిల్స్లో సమాచారం పంపిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ఆధారిత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తో సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. జాబ్, వీసా పేరుతో మోసాలు.. మల్టీలెవల్ మార్కెటింగ్. ఓటీపీ (క్రెడిట్, డెబిట్ కార్డులు)లకు సంబంధించిన మోసాలు రోజులురోజులు పెరిగిపోతున్నాయి. ఇంటర్నెట్ వినియోగాన్ని తమకు అనుకూలంగా మల్చుకొని మోసాలకు తెగబడుతున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ప్రతిరోజు మూడు కమిషనరేట్ల పరిధిల్లో పదుల సంఖ్యలో మోసపోతున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు పోలీస్ అధికారులు సైబర్ సెక్యూరిటీలపై అవగాహన కల్పిస్తున్నారు.
40 శాతం మంది ఆర్డర్లు
హైటెక్ యుగంలో ఇంటర్నెట్ వినియోగించేవారు అధిక శాతంలోనే ఉన్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ సెల్ఫోన్, కంప్యూటర్ను ఉపయోగిస్తున్నారు. మనదేశ జనాభాలో ఇంటర్నెట్ వినియోగదారులు దాదాపు 40-45 శాతం వరకు ఉన్నారని ఓ సర్వేలో తేలింది. వీరిలో అత్యధికులు ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ తదితర సోషల్మీడియాను వినియోగిస్తున్నారు. ఈ-వేదిక ఆధారంగా దాదాపు 50-52 శాతం కొనుగోళ్లుచేస్తున్నారు. ఈ-కామర్స్ ద్వారా షాపింగ్ చేస్తున్నారు. అయితే చాలా మంది తగిన జాగ్రత్తులు తీసుకోవడం లేదు. దాంతో సైబర్ నేరస్తుల చేతిలో మోసపోతున్నారు.
యాంటీ వైరెస్ తప్పని సరి
కంప్యూటర్, సెల్ ఫోన్ ఉపయోగిస్తున్న వారిలో చాలామంది నిర్ణక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బ్యాంక్ లావాదేవాకానీ, ఇతర వస్తువులను ఆర్డర్ చేసినప్పుడు గానీ సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. హ్యాకర్లు చిక్కకుండా వుండేందుకు యాంటీ వైరస్ను డౌన్లోడ్ చేసుకోవడంలో పూర్తిగా నిర్ణక్ష్యం వహిస్తున్నారు. అలా కాకుండా సెల్ఫోన్లు, కంప్యూటర్లు, సర్వర్లుపై కన్నేసించాలి. వాటికి ఎప్పటికప్పుడు యాంటీ వైరస్, ఫైర్వాల్ వేసుకోవడం మంచిది.
తగ్గని సైబర్ నేరస్థుల ఆగడాలు
నగర వాసులు సైబర్ నేరస్తుల బారిన పడకుండా ఉండేందుకు పోలీసులు ఎన్నివిధాలా ప్రయత్నించినా సైబర్ నేరస్తులు రెచ్చిపోతూనే ఉన్నారు. రోజుకు పదుల సంఖ్యలో బాధితులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇదిలావుండగా ఆయా టెలికం సంస్థలు ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు లేకుండా సిమ్ కార్డులను ఇస్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లో సరైన పత్రాలను పరిశీలించకుండానే బ్యాంక్ అధికారులు ఖాతాలను ఇచ్చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపడుతున్న అధికారులకు నిందితుల వద్ద వందల కొద్ది సిమ్కార్డులు, పలు బ్యాంక్ ఖాతాకు సంబంధించిన పాస్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు లభిస్తున్నాయి. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగా సైబర్ నేరస్తులు సులువుగా మోసాలకు పాల్పడుతున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా సైబర్ నేరస్తుల ఆగడాలు తగ్గక పోవడంతో పోలీస్ అధికారులు, వాట్సాప్, సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లఘుచిత్రాలను చిత్రీకరించారు. నేరాలు జరుగుతున్న తీరును దృశ్య రూపంలో చూపిస్తున్నారు. ఈ చిత్రాలు కొంతలో కొంత మేలు చేస్తున్నాయని సీసీఎస్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
స్మార్ట్ ఫిలిలతో అందరు కాకపోయినా కొందరైనా సైబర్నేరాలపై అవగాహన వస్తుందని సీసీఎస్ అధికారులు తెలిపారు. ఈ-కామర్స్ ద్వారా లా వాదేవీలు జరిపేవారు స్టాండర్ట్ యాంటీవైరస్ పద్ధతులను, ఫైర్వాల్స్ వినియోగించకపోతే ముప్పు పొంచివుంటుందని పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బ్యాంకు నుంచి ఎవరు కార్డు, పిన్ నెంబర్, సీవీవీ, ఓటీపీలు అడగరని పోలీసులు తెలిపారు. అలా అడిగారంటే తప్పకుండా అనుమానించాలని, సెల్ఫోన్లో, ఆన్లైన్లోగాని ఎలాంటి వివరాలు చెప్పవద్దని సూచించారు.
నగరంలో మూడేండ్లలో నమోదైన సైబర్ నేరాలు
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. నగరంలో 2016లో 237 కేసులు నమోదు కాగా, 2017లో 284 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది దాదాపు 275కుపైగా కేసులు నమోదైనట్టు సమాచారం.