Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ వీసీ రామచంద్రం
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
కళాశాలలో విద్య, ఉపాధి, పరిశోధనలు మరింత తీవ్రతరం చేయాలన్నా, పలు రంగాల్లో పురోగతి చెందాలన్నా ఆచార్యులు, సిబ్బంది కలిసికట్టుగా పనిచేస్తూ, శ్రమిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఓయూ వీసీ రామచంద్రం అన్నారు. టెక్నాలజి కళాశాల పరిధిలోగల హోటల్ మేనేజ్మెంట్, ఫార్మసి కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకుల సమావేశానికి రామచంద్రం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తు విద్యా రంగంలో వస్తున్న, సిలబస్లో వస్తున్న, టెక్నాలజిలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉత్తమ విద్యను అందించేలా కళాశాలలు, అధ్యాపకులు నిత్యం అప్గ్రేడ్ కావల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల ఉన్నతికై, కళాశాలల ప్రగతి కోసం వసతుల కల్పనకు పెద్దపీఠ వేస్తు భోదనలో మరింత రాణించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆన్ స్క్రీన్ వాల్యువేషన్పై ప్రసంగించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్.శ్యామ్సుందర్ అధ్యక్షతన, కార్యక్రమంలో ఆచార్యులు రమేష్కుమార్, ఎస్.నర్సింహులు, డీన్ కవితావాగ్రే, రవీంద్రనాథ్, బస్వారావు, పలు కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.