Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి
నవతెలంగాణ-అమీర్పేట
చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తుందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి వేణుగోపాలచారి అన్నారు. హైదరాబాద్లోని అమీర్పేట మ్యారిగోల్డ్లోని బిజినెస్ చాప్టర్ అయినా బీఎన్ఐ క్యాపిటల్ మెగా బిజినెస్మీట్ సదస్సుకు ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణుగోపాలా చారి మాట్లాడుతూ వ్యాపారాభివృద్ధికి, ఉపాధి కల్పనకు పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. కేటీఆర్ చొరవతో వ్యాపారులకు పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కార్వి డైరెక్టర్ సుబ్బారావు, బీఎన్ఐ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా షా, బీఎన్ఐ క్యాపిటల్ ప్రెసిడెంట్ శృతి మశ్రూ, వైస్ ప్రెసిడెంట్ రాజా పంతం, సెక్రటరి, ట్రెజరర్ ఆకాశ్బజాజ్లుతో పాటు సుమారు 150మంది సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.