Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఘట్కేసర్ రూరల్
అసైండ్ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కొర్రెముల గ్రామస్తులు కలెక్టర్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఘట్కేసర్ మండలం కొర్రెముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 867 గల అసైండ్ భూమిలో కొంత మంది రియాల్టర్లు గతంలో వెంచర్ చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే హెచ్ఎండీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. స్పందించిన అధికారులు ఆ నిర్మాణాలను కూల్చేసినట్టు స్థానికులు తెలిపారు. కొంత కాలంగా పనులు నిలిపేసిన రియాల్టర్లు తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మాకు సంబంధం లేదనీ, వాటికి హెచ్ఎండీఏ అనుమతులున్నాయంటూ దాటవేస్తున్నారనీ తెలిపారు. అసైండ్ భూమిలో హెచ్ఎండీఏ అనుమతులు ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కొర్రెముల గ్రామస్తులు బిజిలి బిక్షపతి, బిజిలి నర్సింహా, లావణ్య, కల్పన, ఎల్లయ్య, అశోక్ పాల్గొన్నారు.