Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
2019-20 సంవత్సరానికి గాను రామంతాపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేటలోని పాఠశాలలో ఒకటవ తరగతిలో ప్రవేశం కోసం గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివద్ధి శాఖ అధికారి సూచించారు. జనవరి 19వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు నేరుగా గిరిజనశాఖ జిల్లా కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని ఆయన సూచించారు. అభ్యర్థులు రంగారెడ్డి జిల్లా వాస్తవ్యులై ఉండాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షా50వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్ష్షలలోపు ఉండాలని తెలిపారు. ఒక కుటుంబం నుండి ఒక విద్యార్థికి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను తప్పకుండా దరఖాస్తుతో పాటు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తులు డిసెంబర్ 14వ తేదీ నుండి వచ్చే నెల 10వ తేదీలోపు జిల్లా గిరిజన అభివ ద్ధి కార్యాలయంలో నేరుగా అందజేయాలన్నారు. విద్యార్థి 2013 జూన్ 1వ తేదీ నుండి 2014 మే 31వ తేదీ మధ్య కాలంలో జన్మించిన వారే ఉండాలని వివరించారు. 21వ తేదీ నాడు సాయంత్రం మూడు గంటలకు లాటరీ విధానం ద్వారా విద్యార్థులు విద్యార్థులు ఎంపిక జరుగుతుందని తెలిపారు.