Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.25,930 నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం
నవతెలంగాణ - హయత్నగర్
గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఏడుగురిని ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్ఐ రవికూమర్ తెలిపిన వివరాల ప్రకారం నాగోల్ డివిజన్ పరిధిలోని నాంచారమ్మ బస్తీలో ఓ గుడిసెలో పెకట ఆడుతున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. వారు అదే బస్తీకి చెందిన గోపి, వెంకన్న, శరత్చంద్ర, వెంకటేష్, సిద్ధిరాములు, రమేష్, అంజయ్యలు. వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.25,930 నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.