Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కూకట్పల్లి
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని క్కుబ మసీద్ ప్రాంతవాసులు కార్పొరేటర్ సబిహ గౌసుద్దిన్ని కలిసి తమ ప్రాంతంలో సీసీ రోడ్డు వేయాలని కోరారు. స్పందించిన కార్పొరేటర్ శుక్రవారం సీసీ రోడ్డు మంజూరుకు ప్రతిపాదనలు పంపించారు. సీసీ రోడ్డు వేయిస్తానని ప్రాంత వాసులకు హామీ ఇచ్చారు. క్కుబ మసీదు ప్రాంతంలో ఆమె పర్యటించారు. ఆమె వెంట వర్క్ ఇన్స్పెక్టర్, ఇంజినీర్లు ఉన్నారు. వారికి ఆమె సీసీ రోడ్డు వేయాలని సూచించారు. కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వినాయక్ రావు, ఇంజినీర్ హరిణి తదితరులు పాల్గొన్నారు.