Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి ఈశ్వర్పై పెట్టిన రౌడీషీట్ను రద్దు చేయాలి
- దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్
నవతెలంగాణ - రాంనగర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితుల హక్కులను కాలరాస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల ఐక్యత లోపించడం వల్లే చంద్రబాబు అనుచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని, దళిత బహుజన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాల మహానాడు ఏపీ అధ్యక్షులు బండి ఈశ్వర్పై ఓపెన్ చేసిన రౌడీషీట్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి చినరాజప్ప, రాష్ట్ర డీజీపీ, కడప జిల్లా ఎస్పీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని హెచ్చరించారు. ఇలాంటి కేసులతో మానవ హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఈశ్వర్పై పెట్టిన రౌడీషీట్కు నిరసనగా చలో సుండుపల్లికి పిలుపునిస్తున్నామన్నారు.