Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చాధర్ఘాట్
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నారాయణ సేవా సంస్థాన్ వైస్ ప్రెసిడెంట్ అల్కా చౌదరి అధ్వర్యంలో శుక్ర వారం మలక్పేట్లోని వికలాంగుల జాతీయ ఉద్యానవనంలో అంధ విద్యార్థులకు దుప్పట్లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
అంధ విద్యార్థుల సంక్షేమం కోసం నారాయణ సేవ సంస్థాన్ ఆరు ఏండ్లుగా కృషి చేస్తుందని తెలిపారు. అంధ విద్యార్థులకు వైట్ కిన్ స్టిక్స్, వాకి టాకీ వాచెస్, స్టీల్ టిఫిన్ బాక్స్, బెడ్ షీట్స్ అందించారు. అంధ విద్యార్థుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన నారాయణ్ సేవా సమస్థాన్, మహిళ విభాగం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మానవ సేవయే మాధవ సేవ అనే గొప్ప ఉద్దేశంతో మా సంస్థ ముందుకు సాగుతుందన్నారు. కొన్ని ఏండ్ల నుంచి వికలాంగుల సంక్షేమం కోసం పాటు పడుతూ వికలాంగుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు. జనవరిలో వికలాంగులకు అవసరమైన వస్తువులను నారాయణ్సేవ సంస్థాన్ పెద్ద ఎత్తున పంపిణి చేస్తున్నట్టు తెలిపారు.కార్యక్రమంలో వికలాంగుల సంఘం నాయకులు సీవీ రావు, రాంచందర్, నర్సింగ్ రావు, నారాయణ్ సేవ సంస్థాన్, మహిళా విభాగం సభ్యులు అరుణ్ షా, జయంతి రేమజైన్, షీలా మౌలా, సోమాలీ షా తదితరులు పాల్గొన్నారు.