Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
బాపు గీతగీసిన, చిత్రం తీసినా ప్రత్యేకత, విశిష్టత ఉట్టిపడతాయని టీవీ ప్రొడ్యూషర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్ అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలోని కళాదీక్షితులు కళావేదికపై శిఖరం ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో శుక్రవారం బాపు చలన చిత్రోత్సవంలో భాగంగా ఆయన దర్శకత్వం వహించిన మన ఊరి పాండవులు చిత్రం ప్రదర్శించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో షరీఫ్ పాల్గొని ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు రోహిత్కుమార్ను బాపు పురస్కారంతో సత్కరించి మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమలో విశ్వనాథ్, బాపు, జంధ్యాల శైలి విలక్షణమైనదన్నారు. వారు తీసిన చిత్రాలు కళాఖండాలని పేర్కొన్నారు. సత్కార గ్రహీత రోహిత్ మాట్లాడుతూ బాపు తనకు పరోక్ష గురువని తెలిపారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి, నర్తకి డాక్టర్ ఎస్పీ భారతి పాల్గొన్న సభకు గొల్ల కృష్ణ స్వాగతం పలికారు.