Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18,19,20 తేదీల్లో బట్టల పంపిణీ, క్రిస్మస్ విందు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ అధ్యక్షతన శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్, మైనారిటీ శాఖ కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా, మైనార్టీ శాఖ డైరెక్టర్ షానవాజ్ హుస్సేన్, కార్పొరేటర్లు, వార్డు, ఏరియా కమిటీ సభ్యులు, జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ ఎం.దానకిషోర్ మాట్లాడారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జీహెచ్ఎంసీ పరిధిలో 200 ప్రాంతాల్లో పేద క్రిస్టియన్లకు గిఫ్ట్ ప్యాకెట్లు, క్రిస్మస్ విందును నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వాటిలో ముఖ్యమైన విషయాలు
- ప్రతి డివిజన్లో ఒక చర్చి ప్రాంతాన్ని సంబంధిత కార్పొరేటర్ గుర్తించాలి.
- ప్రతి అసెంబ్లీ నియోజక పరిధిలో కనీసం రెండు ప్రాంతాలను సంబంధిత ఎమ్మెల్యే ఎంపిక చేయాలి.
- ప్రతి లొకేషన్లో 500 గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేస్తారు.
- డిసెంబర్ 18, 19, 20 తేదీల మధ్య కొత్త బట్టలు, విందు ఏర్పాటు.
- డిసెంబర్ 18వ తేదీన క్రిస్మస్ ఫీస్ట్ నిర్వహిస్తారు.
- క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, ఫీస్ట్ నిర్వహణకు వేదికను ఎంపిక చేయడానికి డిప్యూటి కమిషనర్లు సంబంధిత కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, చర్చీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.
- జీహెచ్ఎంసీ పరిధిలో 200 ప్రాంతాల్లో 500 చొప్పున మొత్తం లక్ష మందికి గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తారు.
- ప్రతి గిఫ్ట్ ప్యాకెట్లో ఒక పాలిస్టర్ ప్యాంట్, ఒక షర్ట్, ఒక చీర, జాకెట్ పీస్, సెల్వార్ కమీజ్ ఉంటాయి.
- క్రిస్మస్ ఫీస్ట్ విందులో ఒక్కో వేదిక ద్వారా 500మందికి బిర్యాని, రైతా, స్వీట్కేక్లను అందిస్తారు.
- క్రిస్మస్ గిఫ్ట్లను నిరుపేదలు, దివ్యాంగులు, వితంతువులు, అనాథలకు ప్రాధాన్యత ఇస్తారు.
- డిసెంబర్ 17 సాయంత్రం నాంపల్లి హాజ్ భవన్ నుండి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లు పంపిణీ జరుగుతుంది.
- క్రిస్మస్ సందర్భంగా చర్చీలను విద్యుత్ దీపాలతో అలంకరణ.