Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కేంద్రీయ విద్యాలయ సైన్స్ టీచర్ హిందుశంకర్ అన్నారు. శనివారం ఎన్ఎఫ్సీ నగర్కు చెందిన కేంద్రీయ విద్యాలయ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యార్థులు ముందుకెళ్లే విధంగా తీర్చిదిద్దాల్సిన భాద్యత తల్లిదండ్రులపైన ఉందన్నారు.
అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో విక్టర్ ఈమన్యఎల్ రాజేంద్రప్రసాద్, సుధ, ఝాన్సీ, కరుణాకర్ రెడ్డి, కేశవరావ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.