Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఘట్కేసర్ రూరల్
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ వారు నాయకులు శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ అఫిలేట్ అథారిటీ సభ్యులు రేసు లక్ష్మారెడ్డి, ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు బోయపల్లి కొండల్ రెడ్డి, కొండాపూర్ అధ్యక్షులు చిల్కూరి గోపాల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు శౌకత్ మియా, కళ్లెం చంద్రమోహన్ రెడ్డి, బొంత సుధాకర్ నాయకులు పాల్గొన్నారు.
మేడ్చల్ను సమస్యల్లేని
నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
ఘట్కేసర్
మేడ్చల్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానని టీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం ఘట్కేసర్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషిచేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.పి. పిబండారి. శ్రీనివాస్గౌడ్, వైఎస్ఆర్ ట్రస్టు సుదర్శన్ రెడ్డి, బండారి. దాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షలు బొయపల్లి కొండల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుల కూమార్, భిక్షపతి, కృష్ణమూర్తి, అంజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గ్యార లక్ష్మయ్య, సత్తిరెడ్డి పాల్గొన్నారు.