Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభోత్సవానికి హాజరైన హుషారు సినిమా నటులు ధక్ష, తేజుస్
నవతెలంగాణ-బంజారాహిల్స్
గ్రామీణ హస్తకళ వికాస్ సమితి నేతృత్వంలో శ్రీసత్య సాయి నిగమాగమంలో శనివారం 'నేషనల్ సిల్క్ ఎక్స్పో' శనివారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి హుషారు మూవీ నటులు ధక్ష, తేజుస్ కంచర్ల వచ్చారు. భారతీయ సంస్కృతిలో సిల్క్, హ్యాండ్లూమ్ వస్త్రోత్పత్తులకు ప్రత్యేకత ఉందని, నేటికీ వాటికి వన్నెతగ్గలేదని సినీ నటి దక్ష అన్నారు. నిర్వాహకులు జయేశ్ మాట్లాడుతూ ఈ నెల 20వరకు ఈ ఎక్స్పో కొనసాగుతుందని, దేశంలోని 14 నగరాల నుంచి చేనేతకారులు, చేతి పని బృందాలు తమ సిల్క్, హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ వంటి 40 వేల రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని తెలిపారు.