Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మలక్పేట
రంగారెడ్డి జిల్లా మాదిగ యూత్ జేఏసీ అధ్యక్షునిగా నక్క శరత్కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం పిడమర్తి రవి ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శరత్కుమార్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎల్బీనగర్ కమిటీ సభ్యులకు పిడమర్తి రవి నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయికృష్ణ, సాయికుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.