Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్ తెలిపారు. మంగళవారం హస్తినాపురం డివిజన్ పరిధిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ ప్రారంభించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నందనవనం బస్తీలో ఎంతో మంది నిరుపేదలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్, పి.అర్చన, సునిత, రఘు, విజయశ్రీ పాల్గొన్నారు.