Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కూకట్పల్లి
అల్లాపూర్ డివిజన్ యూసుఫ్నగర్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ సబిహ.గౌసుద్దిన్ తెలిపారు. మంగళవారం ఆ ప్రాంతంలో పర్యటించిన కార్పొరేటర్కు కాలనీవాసులు వారి సమస్యలు తెలిపారు. మంజీరా పైప్లైన్ లీకేజీ అవడంతో రోడ్డుపైన నీరు చేరి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆమె వాటర్ ట్రాన్స్మిషన్ డిపార్ట్మెంట్ అధికారుల దష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని వాటర్ లీకేజీ ప్రాంతంలో తవ్వకాలు జరిపి సమస్యను పరిష్కరించారు. మళ్లీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వాటర్ ట్రాన్స్మిషన్ అధికారి చంద్రమోహన్, నాయకులు పాల్గొన్నారు.