Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేపీహెచ్బీ
రోడ్లను ఆక్రమిస్తూ నిత్యం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై కూకట్పల్లి ట్రాఫిక్ అధికారులు కొరడా జులిపించారు. రోడ్డు ఆక్రమించి పెట్టుకున్న టీ స్టాల్, షెడ్లు, బోర్డులను తొలగించారు. మంగళవారం కేపీహెచ్బీ డివిజన్ పరిధిలోని తొమ్మిదో ఫేస్ ప్రధాన రహదారిపై ఇరుప్రక్కల వెలసిన టీ స్టాల్స్, షెడ్లు, వ్యాపార ప్రకటన బోర్డులు, టిఫిన్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు చేసుకునే వారు ప్రధాన రోడ్లను ఆక్రమించారు. దీంతో నిత్యం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేది. ఈ విషయమై ప్రజలు ఫిర్యాదు చేయగా స్పందించిన కూకట్పల్లి ట్రాఫిక్ సీఐ టి.నర్సింగ్రావు, జీహెచ్ఎంసీ టౌన్ ఫ్లానింగ్ అధికారులు సత్యనారాయణ నేతత్వంలో ఆక్రమణలను తొలగించారు. సీఐ మాట్లాడుతూ.. ఆక్రమణలతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. నిత్యం ట్రాఫిక్ జామ్తో పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. వీటిపై ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు.కార్యక్రమంలో జీహెచ్ఎంసీ టౌన్ ఫ్లానింగ్ చైన్ మెన్లు మాణిక్యం, కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.