Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 14న వైఎస్ షర్మిల నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దుష్ప్రచారానికి పాల్పడ్డారనే అనుమానాలతో యూట్యూబ్లో మొత్తం 15వీడియో లింకుల్ని పోలీసులు గుర్తించారు. అవి ఏయే ఐపీ అడ్రస్ల ద్వారా అప్లోడ్ చేశారో వివరాలు సేకరించి వాటి ఆధారంగా బాధ్యుల్ని గుర్తిస్తున్నారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఎనిమిది సోషల్ నెట్వర్కింగ్ సైట్లతోపాటు మిగతా వారికి నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. పూర్తి సాక్షాలను సేకరించేందుకు ఇంకా 200 వీడియోలను పరిశీలించాల్సి ఉందిగా పోలీసుల వర్గాలు అభిప్రాయపడ్డారు. ఆ తరువాత నిందితులను అరెస్టు చేసే అవకాశముంది.