Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్రెడ్డి రంగారెడ్డి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
స్థానిక సంస్థల ఎన్నికల్లో అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి ఓటర్లను కోరారు. అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని పార్టీ నాయకులతో కలిసి మంగళవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని బెదిరించి దొంగచాటుగా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్రెడ్డి పత్రం పొందారని, వీవీ ఫ్యాడ్లను రీ కౌంటింగ్ చేస్తే 35వేల మెజార్టీతో తాను గెలిచేవాడినని తెలిపారు. అధికారులను బెదిరించి దొంగచాటుగా ఎమ్మెల్యేగా గెలిచినట్టు ప్రకటించుకున్నప్పటికీ కోర్టును బెదిరించి మోసం చేయలేరని, తప్పకుండా న్యాయమే గెలుస్తుందన్నారు. మంచిరెడ్డి కిషన్రెడ్డి నిజాయితిగా తాను గెలిచానని తన ఇష్టదైవం సాక్షిగా ప్రమాణం చేస్తే తాను పెట్టిన కేసులను వాపసు తీసుకుంటానన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఫార్మాసిటీలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటపడుతాయని, వాళ్ల ఆటలు సాగవనే భయంతో టీఆర్ఎస్ కుట్రలు పన్ని కావాలనే తాను ఓడిపోయినట్టు ప్రకటించారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 27 గ్రామాలకు 24 గ్రామాలు ప్రతిష్టాత్మక నిర్మల్ పురష్కార అవార్డులు సాధించిన విషయం అందరూ గమనించాలన్నారు. గడిచిన పదేండ్ల కాలంలో ఏ ఒక్క గ్రామానికి అవార్డులు రాకపోగా అభివృద్ధి మరింత కుంటూ పడిందన్నారు. ఈ సమావేశంలో ఇబ్రాహీంపట్నం ఎంపీపీ మర్రి నీరంజన్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఈసీ శేఖర్గౌడ్, అంతటి ఊషయ్యగౌడ్, కొత్తకుర్మ శివకుమార్, కొత్తపల్లి జైపాల్రెడ్డి, పాల్గొన్నారు.