Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఘట్కేసర్
ఎదులాబాద్లో టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాలేరు.సురేష్ గెలుపు కోసం మంగళవారం అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు.వెంకటేశ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా.గోపాల్ ప్రచారం నిర్వహించారు. ఎదులాబాద్ గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి పలు కాలనీల్లో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
టీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయం నుంచి ఖచ్చిరు యాదవ బస్తీ గంగాపుత్ర కాలనీ వరకు పర్యటించారు. అనంతరం గంగాపుత్ర సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లా డుతూ..గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తగిన కృషి చేయనున్నట్టు వారు తెలిపారు. గతంలో ఆయన ఉప సర్పంచ్గా రెండుసార్లు, ఎంపీటీసీగా ఒక్కసారి చేసిన అనుభవంతో గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దుతాడని తెలిపారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి ఆయనను గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా.గోపాల్, వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ కృష్ణమూర్తి నాయకులు కూమార్, బాలవెంకటేష్,రవి తదితరులు పాల్గొన్నారు.