Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ నిరాడంబర జీవితం గడిపిన దామోదరం సంజీవయ్య జీవితం నేటి రాజకీయ నాయకులు అనుసరించాలని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు డాక్టర్ వకుళాభరం కృష్ణమోహనరావు అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలో లలిత కళావేదికపై దామోదరం సంజీవయ్య మెమోరియల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సంజీవయ్య 98వ జయంతి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కృష్ణమోహన్రావు పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా సంజీవయ్య పనిచేసిన తదనంతర కాలంలో కేవలం ఒక పెంకుటింట్లోనే ఆయన జీవతం గడిపారని గుర్తుచేశారు. నిబద్ధత, నిస్వార్థత ఆయన వ్యక్తిత్వమని వివరించారు. గానసభ ప్రతినిధి బండి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా సీనియర్ జర్నలిస్టు శంకర్ నారాయణ, ప్రొఫెసర్ జివి.రత్నాకర్ సభలో పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షులు దామోదర నాగేందర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డి.మురళిమోహన్, శ్రీవాణి, ఉషశ్రీ, సాయిచరిత, సాయినిఖితలు అన్నమాచార్య సంకీర్తనలు మధురంగా గానం చేశారు.