Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగద్గిరిగుట్ట
పేద విద్యార్థులకు షార్ఫ్ ఎన్జీవో, బాటా కంపెనీ సీఎస్ఆర్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలు చేయూతనందిచడం హర్షణీయమని ఠాగూర్స్ హై స్కూల్ కరస్పాండెంట్ బండారి సాయికుమార్ అన్నారు. బుధవారం రంగారెడ్డినగర్ డివిజన్ గాంధీనగర్ ఠాగూర్స్ హై స్కూల్లో పాదల సంరక్షణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంస్థ సభ్యులు పాఠశాల క్యాంపస్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాదలు తీసుకొవాల్సిన జాగ్రత్తలపై, పలు అంశాలపై వ్యాసాలు, చిత్ర లేఖనం పోటీలలో పాల్గొన్నారు. ఇందుల్లో ఐదుగురు విద్యార్థులను విజేతలుగా గుర్తించి జ్ఞాపికలను అందించి అభినందించారు. సుమారు 500 మందికి పాదరక్షల కిట్లను అందజేశారు. బాటా డీజీఎం ఎండీ.అజమ్ మాట్లాడుతూ ఢల్లిీకి చెందిన సంస్థ బాటా ద్వారా ఏటా పలు విధాలుగా సేవలు అందించడంతో పాటు 5 పాఠశాలలను గుర్తించి ఇటువంటి కిట్లను అందజేయడం జరుగుతుందనితెలిపారు. కార్యక్రమంలో షార్ఫ్ ప్రతినిధులు మంజు, మెనిష, నగేష్, పాఠశాల ప్రిన్సిపాల్ బండారి ఉమారాణి, డైరెక్టర్ బండారి నేహా తదితరులు పాల్గొన్నారు.