Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చందానగర్
అన్నార్థుల ఆకలి తీర్చేందుకే జీహెచ్ఎంసీ ఫీడ్ ద నీడ్ కార్యక్రమం చేపట్టిందని వార్డు మెంబర్లు పొడుగు రాంబాబు, కవిత, ఫర్వీన్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని వార్డు కార్యాలయం ఎదుట ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని వార్డు మెంబర్లు, జీహెచ్ఎంసీ అధికారులు గీతం యూనివర్సిటీ విద్యార్థుల సహకారంతో గురువారం ప్రారంభించారు. ప్రేమికుల రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషకరమని వారు తెలిపారు. వార్డు కార్యాలయం ఎదుట పేదలకు, ఆకలితో ఉన్న అన్నార్తులకు భోజనం ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీ బాల్రాజు, ఎన్విరాన్మెంటల్ ఏఈ అశ్విని, వేణు, చంద్రకళ, తదితరులు ఉన్నారు.