Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సికింద్రాబాద్
విద్యార్థులు తమ ప్రతిభను చాటి భవిష్యతులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలుగు అకాడమీ రచయిత న్యూ సైన్స్ కాలేజీ డిపార్టుమెంట్ ఆఫ్ కెమెస్ట్రీ ప్రొఫెసర్ డాక్టరు కోయ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం తుకారాంగేట్లోని శ్రీ శిరిడి సాయిబాబా హైస్కూల్లో జరిగిన టాలెంట్ ఫెయిర్ షో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచాలంటే ముందు వారిలో ఆత్మవిశ్వాసం అలవరుచుకోవాలన్నారు. మసస్సు నిశ్చలంగా ఉంటే చదువుపై శ్రద్ధ పెరుగుతుందన్నారు. విదార్థులు చదువుతో పాటు ఇతరుల పట్ల దయ, కరుణ కల్గి ఉండాలన్నారు. స్కూల్ కరస్పాండెంట్ వాసవి శ్రీధర్, ప్రిన్సిపల్ శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాదీ ఇలాంటి టాలెంట్ ఫెయిర్ షో నిర్వహిస్తే విద్యార్థులు తమ ప్రతిభను చూపిస్తామన్నారు. టాలెంట్ ఫెయిర్ షోలో విదార్థులు వివిధ అంశాలపై ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికారి యాదగిరి, ప్రదర్శనలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.