Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
క్రిస్టియన్స్ సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మల్లాపూర్ డివిజన్లోని పాస్టర్స్, ప్రేయర్, అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికైన కమిటీ సభ్యులు, కార్పొరేటర్ను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా క్రిస్టియన్ల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. స్థానికంగా ఉండే పాస్టర్స్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు తిమోతిరావు, ఉపాధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శి సురేష్పాల్, కోశాధికారి శామ్యూల్ రంగారావు అడ్వయిజర్స్ అనిల్కుమార్, శాంతరాజు, యూత్ అడ్వయిజర్ అగస్టీన్, సురేష్ పాల్గొన్నారు.