Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యక్షుడికి కాలనీ వాసుల వినతి
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు ఐదో వార్డులోని ఓల్డ్ వాసవినగర్లో నూతన డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కాలనీ ప్రతినిధులు గురువారం బోర్డు ఉపాధ్యక్షుడు కలిసి వినతి పత్రం అందజేశారు. డ్రెయినేజీ సమస్య జటిలంగా ఉన్నందున్న పాత వాటి స్థానంలో, నూతన పైపులైన్లను నిర్మించి సమస్య పరిష్కారించాలని సంక్షేమ ప్రతినిధులు, ఉపాధ్యక్షుడికి వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ.. డ్రెయినేజీ సమస్యను వెంటనే పరిష్కరించేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, లక్ష్మణ్రావు, సత్యనారాయణ, బాలకృష్ణ, చందు పాల్గొన్నారు.