Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
అన్నోజిగూడలో మున్నూరు కాపు మహాసభ ఏర్పాట్లను రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పురుషోత్తం రావు గురువారం పరిశీలించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజీ గూడలోని శివ ఫంక్షన్ హాల్లో ఈ నెల 16న నిర్వహించే కాపు మహాసభ ఏర్పాట్లను మున్నూరు కాపు సంఘం నాయకులతో కలసి ఆయన పరిశీలించారు. ఈ మహాసభకు కాపులు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో నాయకులు ఐజి సుంకరి బాలకృష్ణారావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు మీసాల చంద్రయ్య, జాతీయ బీసీ సంఘం కార్యదర్శి గుజ్జ రమేష్, శంకర్ షేర్, కోట్ల శంకర్, హెచ్ఎంఎస్ నాయకులు రెబ్బరామావు, కొర్రెముల మాజీ సర్పంచ్ భైనగారి నాగరాజు, ఇతర కులపెద్దలు పాల్గ్గొన్నారు.