Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్ర, శనివా రాల్లో మంచినీటి సరఫరాను నిలిపివేస్తున్నట్టు వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఘన్పూర్ నుంచి లింగంపల్లి మధ్యలో గోదావరి త్రాగునీటి సరఫరా ప్రాజెక్టు ఫేస్-1, రింగ్ మెయిన్-1 పరిధిలో మరమ్మతులు చేపడుతున్నట్టు తెలి పారు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకూ నీటి సరఫరా ఉండదన్నారు. ఈ సందర్భంగా ఎర్రగడ్డ, ఎల్లారెడ్డి గూడ, వెంగళరావు నగర్, యూసుఫ్గూడ, అమీర్పేట, ఎస్సార్ నగర్, సోమాజిగూడ, వెంకటగిరి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, గాయత్రినగర్, పార్వత్నగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, భాగ్యనగర్ కాలనీ, బాలాజీనగర్, ఎల్లమ్మ బండ, జగద్గరి గుట్ట, ఆదర్శనగర్, షాపూర్ నగర్, చింతల్, హఫీజ్పేట్, గోపాల్ నగర్, మయూరి నగర్, తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.