Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే గొడుగు కిందకు డీవీఈడీ ఔట్సోర్సింగ్ సిబ్బంది, అ టెండర్లకు ఆహ్వానం
- స్థాయీ సంఘం సమావేశంలో నిర్ణయం
- పలు తీర్మానాల ఆమోదం
నవతెలంగాణ - సిటీబ్యూరో
గ్రేటర్లో ప్రతిజోన్ పరిధిలో కనీసం మూడు మేజర్ థీమ్ పార్కులను నిర్మించాలని స్థాయీ సంఘం సమావేశం నిర్ణయించింది. నగరంలో ఖాళీగా ఉన్న మూడు ఎకరాలకు పైగా స్థలాలను గుర్తించి వాటిలో మేజర్ పార్కులను ఏర్పాటు చేయడానికి వచ్చే సమావేశంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) ద్వారా సాంకేతిక సాయాన్ని తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. వాటిలో
ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేసే వివిధ కేటగిరిల ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి రెండు కొత్త విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.
ఈవీడీఎం విభాగంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఐదు ప్యాకేజీల కింద చేస్తూ టెండర్లకు ఆహ్వానం.
అంబర్పేట్ 'చే' నెంబర్ జంక్షన్ నుండి కాలా బ్రిడ్జి వరకు రూ.3.85కోట్లతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం
బతుకమ్మ కుంట నుండి 'చే' నెంబర్ వరకు రూ.5.20కోట్లతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ ప్రతిపాదనలు
చార్మినార్ సర్కిల్ జహంగీర్నగర్లోని మస్కటి డైరీ నుండి ఇంటి నెం.18-7-212/28/28 వరకు ఆర్సీసీ బాక్స్ డ్రెయిన్ రీమోడలింగ్ను రూ.4.50 కోట్లతో చేపట్టే పనుల ప్రతిపాదనలు
అదనపుకమిషనర్(రెవెన్యూ)పేషిలో పనిచేసే ఒక ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సర్వీసులను మరో సంవత్సరం పాటు పొడిగించేందుకు ప్రతిపాదనలు.
మొజంజాహి మార్కెట్లో చికెన్, మీట్ మార్కెట్ బ్లాక్ల పునరుద్దరణ, ఫ్లోరింగ్, జాక్ ఆర్చ్ సీలింగ్ నిర్మాణాలను రూ.5.80కోట్లతో చేపట్టే నిర్మాణానికి ఆమోదం.
ఈ-ఆఫీస్ నిర్వహణలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు, సీనియర్ ప్రోగ్రామర్ల సర్వీస్లను మరో సంవత్సరం పాటు పొడిగించే తీర్మానానికి ఆమోదం.
చిక్కడపల్లిలోని స్ట్రీట్ నెంబర్-1లో ఉన్న ఇంటి నెంబర్ 1-1-261/7 నుండి 1-1-271 వరకు విస్తరణ నిమిత్తం 15 ఆస్తుల సేకరణ చేపట్టే తీర్మానానికి ఆమోదం.
అడ్వకేట్ ఎ.రాజాచంద్రశేఖర్గౌడ్ను కమిషనర్ లీగల్ ఓఎస్డీగా నెలకు రూ.75,000 గౌరవ వేతనానికి నియమించే తీర్మానానికి ఆమోదం.
నగరంలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటుచేసిన లేక్ గార్డ్స్లుగా నియమించిన 329 మంది ఔట్సోర్సింగ్ వర్కర్లకు వేతనం కింద రూ.5.32 కోట్లు చెల్లించే తీర్మానానికి ఆమోదం.
నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) ఏజెన్సీ ద్వారా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగానికి ఔట్సోర్సింగ్ పద్దతిన తీసుకున్న 100మంది సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సర్వీస్లను మరో సంవత్సరం పాటు పొడిగించే తీర్మానానికి ఆమోదం.
జవహర్నగర్ డంప్యార్డ్ నుండి మల్కారం చెరువులోకి వెలువడే కాలుష్య జలాల (లీచెట్)ను శుద్ది చేసేందుకు రూ.11కోట్లతో 2వేల కేఎల్డీ సామర్థ్యం గల రెండు మొబైల్ ఆర్వో యూనిట్లను అద్దె పద్దతిలో ఏర్పాటు చేసే ప్రతిపాదనలకు ఆమోదం.
ఉప్పుగూడ ఆర్యూబీ వద్ద సర్వీస్ రోడ్, ఫుట్పాత్, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణాలను రూ.5.18కోట్లతో చేపట్టే తీర్మానానికి ఆమోదం.
-మిదాని జంక్షన్ నుండి ఓవైసీ ఆసుపత్రి జంక్షన్ వరకు నిర్మించనున్న ఫ్లైఓవర్కు సర్వీస్ రోడ్డును లక్ష్మారెడ్డి గార్డెన్ నుండి ఓవైసీ ఆసుపత్రి వరకు రూ.5.85కోట్లతో నిర్మించే తీర్మానానికి ఆమోదం.