Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
తెలుగు సాహిత్యానికి భాషకు యువతరాన్ని చేరువ చేసిన సాహితీ రూపం నానీలు. ఎవరెన్నీ విమర్శలు చేసిన నానీల వెలుగును ఎవరూ ఆపలేరని నానిలు రూపకర్త డాక్టర్ ఎన్.గోపి అన్నారు. రవీంద్రభారతిలో సమావేశ మందిరంలో గురువారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఎన్వి రఘువీర ప్రతాప్ రచించిన నానీ ముత్యాలు నానీల సంపుటి ఆవిష్కరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఆచార్య గోపి పాల్గొని సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. నానీల కుటుంబంలో రఘువీర సభ్యుడైనాడని ఆయన సృజించిన అంశాలు సామాజికమైనవి, మానవ స్వభావాన్ని ప్రతిబించేవి ఉన్నాయన్నారు. ఎంతో అక్షరానుభవం ఉన్న రఘువీర చక్కని వచన కవితలు కూడా రాయగలరన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ భవిష్యత్లో నానీలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక అధ్యయం ఉంటుందన్నారు. రఘువీర నానీలు ఉదహరించే విధంగా ఉన్నాయన్నారు. రచయిత్రి డాక్టర్ సి.భవాని అధ్యక్షత వహించిన సభలో నేటినిజం దినపత్రిక సంపాదకులు భైస దేవదాసు, విమర్శకులు డాక్టర్ ఎస్ రఘు, నెమలిక పత్రిక సంపాదకులు దేవి, కవి నారాయణ శర్మ పాల్గొనగా డాక్టర్ పోరెడ్డి రంగయ్య స్వాగతం పలికారు.