Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగద్గిరిగుట్ట
దొరల పాలన నుంచి పేద ప్రజలకు విముక్తి కల్పించిన మహనీయుడు ధర్మబిక్షమని సీపీఐ మేడ్చల్ కార్యదర్శి గూడ ఐలయ్య అన్నారు. తెలంగాణ సాయూధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ, అఖిల భారత గీత పని వారల సంఘం జాతీయ అధ్యక్షులు బొమ్మగాని ధర్మబిక్షం 97వ జయంతి సందర్భంగా శుక్రవారం జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూంనగర్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ జి.వరమ్మ అధ్యక్షత వహించారు. ధర్మబిక్షం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నల్గొండ జి.పాండరి, నాయకులు సాయి ప్రవీణ్గౌడ్, రాంచంద్రాగౌడ్, అక్బర్, యాదగిరి, కె.మహేష్ తదితరులు పాల్గొన్నారు.