Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
విద్యార్థుల మెస్ బకాయిలు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతలు ఆర్ఎన్ శంకర్, కాంపెల్లి శ్రీనివాస్లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఓయూలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వర్సిటీ విద్యార్థుల మెస్ బకాయిలు 14 కోట్లు మాఫీి చేయాలన్నారు. పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు మెస్ బకాయిలు చెల్లించే స్థోమత లేక గ్రామాలకు వెళ్తున్నారని చెప్పారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నేతలు ప్రేమ్, సత్స, సుమంత్, ఇస్మాయిల్ పాల్గొన్నారు.