Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
మండలంలోని జల్పల్లి గ్రామానికి చెందిన సువర్ణ గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి శుక్రవారం మృతురాలి కుటుంబాన్ని సందర్శించారు. జంగయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భరోసానిచ్చారు. ఆమె వెంట జల్పల్లి మాజీ సర్పంచ్ సూరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ దూడల శ్రీనివాస్గౌడ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.