Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
'కలయ సఖి సుందరం కృష్ణం' దీక్షితార్కృతితో కూడిన ఏకంకృష్ణం నృత్య రూపకాన్ని కూచిపూడి శైలిలో నర్తించి కళాకారిణీలు ప్రేక్షకులను ముగ్దుల చేశారు. శ్రీ హిరణ్మయి కూచిపూడి నృత్యాలయ ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలో శుక్రవారం ఏకంకృష్ణం నృత్యరూపకం ప్రదర్శితమైంది. నృత్య గురువు చంద్రిక శిష్యురాండ్రు కృష్ణుడు గోపికలతో కేళిని నయనమనోహరంగా నర్తించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. మహాగణపతితో నృత్యాంశాలను ప్రారంభించి నర్తకీమణులు మరాఠి, మణిపూరి, రాజస్తాని నృత్య రీతులను ప్రదర్శించారు. యుద్ధ నైపుణ్యాన్ని తెలిపే నాట్య భంగిమలను నర్తకి చంద్రిక నర్తనం ప్రశంసనీయం. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ చంద్రిక గురువుగా, శిష్యులకు ఇచ్చిన శిక్షణ అపురూపమని శూరమండల్ అధ్యక్షుడు మోహన్ తదితరులు సభలో పాల్గొని నర్తకీమణులను అభినందించారు.