Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
విద్యార్థులను ప్రతిభా వంతులుగా తీర్చిదిద్దడంతో పాటు వారికి చేయూతనందించడంలో శ్రీచైతన్య యాజమాన్యం ముందుంటుందని దిల్సుఖ్నగర్ ఏజీఎం సతీష్ అన్నారు. నేషనల్ టాలెంట్ సెర్చ్(ఎన్టీఎస్ఈ) మొదటి దశ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఎల్బీనగర్ శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులకు శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఎగ్జిక్యూటివ్డీన్ ప్రవీణ్, ప్రధానోపాధ్యాయురాలు భవానితో కలిసి ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడి చదివితేనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని సూచించారు. ప్రతి పోటీ పరీక్షల్లోనూ శ్రీచైతన్య విద్యార్థుల విజయపరంపరా కొనసాగుతూనే ఉందన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉమాజయంత్, రోహిణ్ప్రభు, వర్ష, సాత్వికరెడ్డి, ప్రతిక్మోహన్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ వాస్, మెడ్కో ఇన్చార్జి శ్రీనివాసులు, ఎన్టీఎస్ఈ ఇన్చార్జి రాఘవేందర్, క్యాంపస్ ఇన్చార్జి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.