Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ:
టీడీటీఎఫ్, బీసీటీఏ, టీఎస్సీఎస్ టీయూఎస్, ఏటీఏ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు బలపర్చిన టీటీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని ఆ సంఘం అధ్యక్షులు ఇంజమూరి రఘునందన్, బీసీ టీచర్స్ అసోసియేషన్(బీసీటీఏ) అధ్యక్షులు కె.కష్ణుడు ఉపాధ్యాయ, అధ్యాపకులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనిమిది ఉపా ధ్యాయ, అధ్యాపక సంఘాలు బలపరిచిన ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీం నగర్ నిజామాబాద్, మెదక్, జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిట్యాల రాములు, ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్ తాటికొండ వెంకట రాజయ్యలను గెలిపిం చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్(ఏటీఏ) అధ్యక్షులు కల్లూరి జయబాబు, తెలంగాణ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన ్(టీడీపీఎఫ్)అధ్యక్షులు ఎస్.రాజేందర్, తెలంగాణ ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం (టీఎస్సీఎస్ టీయూఎస్) అధ్యక్షులు శాగ కైలాసం పాల్గొన్నారు.