Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతికత వల్ల వచ్చిన కొత్త చిక్కిది
- జనాలను వినియోగదారులుగా మారుస్తున్న టెక్నాలజీ
- 'సాంకేతిక పరిజ్ఞానం- ప్రజాస్వామ్యం' పై చర్చాగోష్టిలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకీ పెరిగిపో తున్న నేపథ్యం లో సామాజిక మాధ్యమాల ద్వారా అనేకాంశాలను విస్తృతంగా జనం లోకి తీసుకెళ్లేందుకు అవకాశం కలుగుతు న్నదని పలువురు వక్తలు చెప్పారు. ఇదే సమయంలో రాజకీయ అంశాల నుంచి వ్యక్తిగత విషయాల వరకూ ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్లలో వస్తున్న పోస్టుల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని గందరగోళ పరిస్థితి నెల కొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల మెదళ్లను ప్రభావితం చేయ టానికి రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలను రకరకాలుగా వాడుకు ంటున్నాయని తెలిపారు. వీటిపట్ల అప్రమత్తంగా ఉండటం ద్వారా ఆయా పార్టీల మాయలో పడకుం డా ఉండాలని ఓటర్లకు సూచిం చారు. 'ప్రజాస్వామ్యం కోసం సాంకేతిక పరిజ్ఞానం' అనే అం శంపై శనివారం హైదరాబాద్లో చర్చాగోష్టి నిర్వహించారు. 'ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (స్వేచ్ఛ)' ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ సభ్యులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ప్రారం భోపన్యాసం చేశారు. స్వేచ్ఛ వర్కింగ్ చైర్మెన్ ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించగా బ్యాడ్మింటన్ క్రీడా కారిణి గుత్తా జ్వాల, స్వేచ్ఛ ప్రధాన కార్యదర్శి వై.కిరణ్చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ... పౌరుల వ్యక్తి గత డేటాను వివిధ మార్గాల్లో పొందటం ద్వారా ఫేస్బుక్, యూ ట్యూబ్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలు జనాలను వినియోగదాలుగా మార్చివే స్తున్నాయ ని తెలిపారు. మార్కెట్ మాయాజాలం మనిషిని భౌతికంగానూ, మానసికంగానూ మార్చివేస్తున్న దని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అతడి ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతున్నదని చెప్పారు. వివిధ సంఘటనలకు సంబంధించి అసత్య వార్తలు, ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమవుతున్నా యని చెప్పారు. ఈ విధంగా అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేయటమన్నది ఓ పెద్ద నేరమని ఆయన తెలిపారు. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికీ ఓటేసే హక్కును, పోటీ చేసే హక్కునూ కల్పించిందని నాగేశ్వర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం సూట్కేసు రాజకీయాలు ఎక్కువయ్యా యని తెలిపారు. సూట్కేసులతో వచ్చిన వారికి, ప్యారాచూట్లలో దిగిన వారికే అనేక పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి వారు ప్రజల మెదళ్లను సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేసేందుకు విపరీతంగా ఖర్చు పెడుతున్నారని వివరించారు. 2014 ఎన్నికల్లో పలు ప్రధాన పార్టీలు సోషల్ మీడియా కోసమే రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు రెండింటికీ పనిచేసిన సోషల్ మీడియా సంస్థ ఒక్కటేనని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజాస్వా మ్యాన్ని కాపాడటానికి, దాన్ని పరిరక్షించటానికి ఐటీ సెక్టార్లో పనిచేసే వారు, సోషల్ మీడియాపై పట్టున్నవారూ నడుం బిగించాలని కోరారు.
జ్వాల మాట్లాడుతూ... సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి అంశాన్నీ గుడ్డిగా నమ్మకుండా అది నిజమా? కాదా? అని తెలుసు కోవటానికి ప్రశ్నలు సంధించాలని సూచించారు. దీన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఇది మరింత అవసరమని ఆమె నొక్కి చెప్పారు.