Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ
-గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా ముందుకుసాగాలి
-సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అంజన్కుమార్ యాదవ్
నవతెలంగాణ-అంబర్పేట/ నారాయణగూడ
మోడీ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు పలుకుతూ కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి అంజన్కుమార్ యాదవ్ అన్నారు. శనివారం గోల్నాక డివిజన్ సెల్వా గార్డెన్ ఫంక్షన్హాల్లో అంబర్పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్తతస్థాయి సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రానికి గుండె కాయగా ఉన్న సికింద్రాబాద్ సీటును కైవసం చేసు కుంటుందని దీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకూ సోనియాగాంధీని దేవతగా పోల్చిన కేసీఆర్ ఇప్పుడు ముఖం చాటేసి సోనియాను దుయ్య బట్టడం ఎంతవరకూ సమంజసమన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏనాడు వ్యతి రేకించిన దాఖలాలు లేవని కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మద్దతు పలికారని గుర్తుచేశారు. ఈ ఎన్నికలు మోడీ-రాహుల్ మధ్యే ఉంటాయని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసు కోవాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జ్ఞానేశ్వర్గౌడ్, నారాయణ స్వామి, వరప్రసాద్, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ధనుంజయ, నాయకులు లవతి యాదగిరి, తోట జగన్నాధం, వీర్ నాసర్, మహ్మద్ గౌస్, గ్రేటర్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్కుమార్ యాదవ్, వీర్ జాబేల్, కోటం అనిల్ కుమార్, కోట్ల రామకష్ణ, వంజాల వెంకటేష్ గౌడ్, గడ్డం శ్రీధర్గౌడ్, సి.హెచ్.సుధాకర్, షేక్ జమీల్, ఎన్.ఎస్.యు.ఐ గ్రేటర్ అధ్యక్షులు అభిజిత్ యాదవ్, ఫరీద్, మజార్, హరితిలక్ సింగ్, రాఘవ,రోహిత్, నునితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నారాయణగూడ: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ అని, కేసీఆర్ తో తెలంగాణ రాలేదని హైదరాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్లమెంట్ మాజీ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో టీిఆర్ఎస్ పార్టీ 16 స్థానాలు సాధించి కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్ ప్రగల్బాలు పలుకుతున్నారని, గతంలో 16 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.ప్రధాని మోడీ రాబోయే రోజులు అన్ని అచ్చేదిన్ అని చెప్పి పెద్దనోట్లను రద్దు చేశారని, జీఎస్టీ విధించి ప్రజలు, వ్యాపారులపై మోయలేని భారం వేశారని విమ ర్శించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శులు జ్యోతి రెడ్డి, నగర కార్యదర్శి మధుకర్ యాదవ్, బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.