Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
పారిశుద్య సిబ్బంది ప్రతిరోజూ రోడ్లపై ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించి డస్ట్బిన్లో వేయాలని ఏఎస్రావునగర్ డివిజన్ కార్పొరేటర్ పావని మణిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం జై జవాన్ కాలనీలో కొన్ని రోజుల నుంచి రోడ్లను శుభ్రం చేయడంలేదని, చెత్తను తొలగించడంలేదని స్థానికుల ఫిర్యాదు మేరకు ఆ కాలనీలో పర్యటించారు. వెంటనే సిబ్బందిని పిలిపించి చెత్తను డస్ట్బిన్లో వేయించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. అలాగే తాగునీటి సరఫరా సరిగా లేదని ఫిర్యాదు రావడంతో వెంటనే వాటర్ వర్క్స్ అధికారులతో చర్చించి మరమ్మతులు చేయించానట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలయ్య, రమేష్చారి, వెంకటేశ్వర్లు, ప్రసాద్, సాహెబ్, సుబ్బారావు, మణిపాల్రెడ్డి పాల్గొన్నారు.