Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సహకారంతో బోడుప్పల్ మున్సిపల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని టీఆర్ఎస్ బోడుప్పల్ పట్టణ అద్యక్షులు చెర్ల ఆంజనేయులు యాదవ్ అన్నారు. మంగళవారం బోడుప్పల్ పరిధిలోని వెస్ట్ మారుతీ నగర్ కాలనీ, దేవేందర్ నగర్ కాలనీల్లో మున్సిపల్ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. గుత్తేదారులు ఆలసత్వం వహించకుండా పనులను వెంటనే పూర్తి చేయాలని సూచిం చారు.ఈ కార్య క్రమంలో టీఆర్ఎస్ నాయకులు కృష్ణ, చీరాల నర్సింహా రవీందర్, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.