Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సికింద్రాబాద్/ నేరేడ్మెట్
అల్వాల్ సర్కిల్లోని మచ్చబొల్లారం 133వ డివిజన్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రామాణాలు పాటించాలని కార్పొరేటర్ రాజ్జితేంద్రనాధ్ అన్నారు. మంగళవారం అభివృద్ధి పనులను దగ్గరుండి పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించినప్పుడే డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎప్పటి కప్పుడు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మచ్చబొల్లారంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి బస్తీ వాసులతో మాట్లాడుతూ.. డివిజన్లోని ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని బస్తీ వాసులకు సూచించారు. అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సురేందర్రెడ్డి, సాయిలు, శ్రీనివాస్గౌడ్, వెంకటేష్, మధు, మాధవ్ పాల్గొన్నారు.