Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
బస్తీ సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం నియోజక వర్గంలోని రాంనగర్ డివిజన్ అంబేద్కర్ బస్తీ అధ్యక్షు నిగా ఎన్నికైన రాకం సత్యనారాయణను ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బస్తీలలో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలని, సమస్యలు పరిష్కరించి బస్తీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయ కులు ముచ్చకుర్తి ప్రభాకర్, ఆర్.మోజస్, అంజయ్య, లింగం, శ్రీహరి, హనుమంతరావు, నర్సింగ్రావు, పూర్ణ ఆనందరావు, మహేందర్, అరుణ్ కుమార్, ఎర్రం శేఖర్, లలిత, వెంకటేష్లు పాల్గొన్నారు..