Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
ఓట్ల లెక్కింపు కేంద్రానికి అభ్యర్థులతో పాటు ఏజేంట్లు హాజరు కావాలని ఎంపీడీఓ హారీష్కుమార్ తెలిపారు. సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అభ్యర్థులు, ఏజెంట్లు సకాలంలో హాజరుకావాలని అన్నారు. దానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారి నుంచి పాస్లు పొందాలని తెలిపారు. మొదట ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు, తర్వాత జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఉంటుందని అన్నారు. ఏజెంట్లుగా ఉండే వారు సర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, నామినేటేడ్ పదవులలో ఉన్న వారు ఏజెంట్లుగా కూర్చోడానికి అనుమతి ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శాంత, ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు.