Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆర్.మైపాల్
ధారూర్: ధారూర్ మండలంలోని రాజాపూర్లో సోమవారం పిడుగుపాటుకు గురై మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆర్ మైపాల్ అన్నారు. మంగళవారం రాజాపూర్లో పిడగు పాటుకు మృతి చెందిన కుటుంబాన్ని వారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ప్రకృతి వైపరిత్యంతో మృత్యు వాత పడుతున్న కుటుంబాలను ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిడుగు పాటుకు గురై మృతి చెందిన వారి కుటుంబంలో మిగిలిన వారికి ప్రభుత్వం 5 ఎకరాల భూమి, రూ. 30 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు.