Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్మికుల వేతనాలు పెంచాలి
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరామల్గూడ ఘంటాపూడ్స్ కంపెనీ కార్మికుల వేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర శ్రామిక మహిళా కన్వీనర్ రమ డిమాండ్ చేశారు. ఘంటాపూడ్స్ కంపెనీని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పిల్లిపల్లి గ్రామానికి తరలించే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం నాల్గో రోజు మహిళా కార్మికులు ఆందోళన చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీఐటీ యూ రాష్ట్ర శ్రామిక మహిళా కన్వీనర్ రమా మాట్లాడుతూ.. 30 ఏండ్ల నుంచి మహిళా కార్యకర్తలను శ్రమ దోపిడి చేస్తున్న ఘంటాపూడ్స్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం రూ.18000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ కొనసాగించాలని, ఉచిత ట్రావెల్స్ సౌకర్యం కల్పించాలని, బ్రేక్సిస్టం ఎత్తివేయాలని, నెల వేతనం ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఫర్మినెంట్ చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి చట్టబద్దంగా బోనస్ ఇవ్వాలని, ప్రమా దవశాత్తు గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందించాలని, కార్మికులపై సూపర్వైజర్ల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. లేని యెడల సమ్మెను ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కవిత, ఎల్బీనగర్ సీఐటీయూ నాయకులు వీరయ్య, ఎల్లయ్య, రాములు, రాజు, జంగయ్య, కృష్ణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.