Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై అక్షర విద్యా ట్రస్ట్ (చెన్నై) ఆధ్వర్యంలో సత్యవ్రతానంద సరస్వతి నిర్వహిస్తున్న గీతాజ్ఞాన యజ్ఞం ప్రసంగ కార్యక్రమం రెండో రోజైన బుధవారం ప్రేక్షక స్పందన విశేషంగా ఉంది. భగవద్గీతలోని ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం అంశంపై ఆమె మాట్లాడుతూ.. మనిషి మనసులో ఉన్న భయం, దుఖం తొలగించడమే ఈ అధ్యాయ లక్ష్యమన్నారు. గానసభ అధ్యక్షులు కళా జనార్థన మూర్తి, నిర్వాహకురాలు మంగళా ప్రసాద్ పాల్గొన్నారు.